మా డీఎన్ఏలోనే రాముడి సందేశం ఉంది: కాంగ్రెస్ నేత మల్లు రవి
- రాముడి గుడికి రాజీవ్ గాంధీ హయాంలోనే ఫౌండేషన్ వేశామన్న మల్లు రవి
- కోర్టు కేసుల కారణంగా తాము కట్టలేదని వెల్లడి
- మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఈ నెల 22న గుర్తు చేసుకోవాలని సూచన
భద్రాచలంలో ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బేగంబజార్లో ఇటీవల తాము ఏపీ ఉపముఖ్యమంత్రిపై చేసిన ఫిర్యాదుకు ఎఫ్ఐఆర్ నమోదు అయిందని తెలిపారు. అధిష్ఠానం ఆదేశిస్తే తాను నాగర్కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 16 సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.