17 లోక్ సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్
- లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తమ వైపే చూస్తున్నారని వ్యాఖ్య
- కేంద్రంలోనూ కాంగ్రెస్ గెలిస్తేనే తెలంగాణకు మరిన్ని నిధులు వస్తాయన్న పొన్నం
- 14 సీట్లు కచ్చితంగా గెలుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా
14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పదిహేడు లోక్ సభ స్థానాలకు గాను 14 చోట్ల కచ్చితంగా గెలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలిపిస్తామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీలో చర్చించినట్లు తెలిపారు. కాగా, అంతకుముందు లోక్ సభ స్థానాల సమన్వయకర్తలతో ఏఐసీసీ నేతలు సమావేశం నిర్వహించారు.