bus: సూర్యాపేట జిల్లాలో పల్టీలు కొట్టిన రాజధాని ఏసీ బస్సు

  • మోతె మండలం మామిళ్లగూడెం వద్ద బస్సు బోల్తా
  • హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న బస్సు
  • అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తింపు
Bus accident in Suryapet district

సూర్యాపేట జిల్లా మోతె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వల్ప గాయాలు మినహా... ఎవరికీ ఏమీ కాలేదు. ఖమ్మం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తుండగా ఈ ఘటన  జరిగింది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద జాతీయ రహదారిపై ఈ బస్సు బోల్తా పడింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

More Telugu News