Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం భద్రతలో పాల్గొనే సిబ్బంది స్మార్ట్‌ఫోన్‌లు వాడకూడదు

  • భద్రతలో పాల్గొనే భద్రతా సిబ్బందికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సూచన
  • ప్రకటన విడుదల చేసిన ఉత్తరప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్
  • అయోధ్యలో ముమ్మరంగా కొనసాగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ఏర్పాట్లు
Police personnel should not use smartphones on Prana Pratishtha Day in Ayodhya says police

అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠాపన వేడుకల భద్రతలో పాల్గొననున్న భద్రతా సిబ్బంది స్మార్ట్‌ఫోన్లు వాడకూడదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ నెల 22 (సోమవారం)న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశ, విదేశాల నుంచి పలువురు వీవీఐపీ అతిథులు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ఠ భద్రతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వేడుకకు ఒక వారం ముందు జనవరి 16 నుంచి వైదిక ఆచార కార్యక్రమాలు మొదలుకానున్నాయి.

More Telugu News