రేపటితో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తోంది: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించిందన్న తుమ్మల
- ప్రజల వద్దకే పాలన తీసుకుపోవాలనే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడి
- రేపు చివరి రోజు కాబట్టి పంచాయతీ లేదా వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని సూచన
ఆరు గ్యారెంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మిగతా పథకాల లబ్ధి కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని... అర్హులైతే మీ ఇంటికే పథకాలు నడిచివస్తాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తుమ్మల పలువురు దరఖాస్తుదారులతో ముచ్చటించారు.