ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన జేఎన్టీయూ
- రేపు జేఎన్టీయూ-హెచ్ స్నాతకోత్సవం
- 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో సోమ్ నాథ్ కు డాక్టరేట్ ప్రదానం
- సోమ్ నాథ్ సారథ్యంలో ఇస్రో ఖాతాలో ఘనతర విజయాలు
ఈ నేపథ్యంలో,ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమ్ నాథ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా, ఆయనకు హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
జేఎన్టీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.నరసింహారెడ్డి మాట్లాడుతూ, జనవరి 5న జేఎన్టీయూ 12వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామని వెల్లడించారు. అనంతరం డాక్టర్ సోమ్ నాథ్ ప్రసంగిస్తారని వివరించారు.