న్యూ ఇయర్ రోజున ముంబైని పేల్చేస్తున్నాం.. అగంతకుడి హెచ్చరికలతో ఆర్థిక రాజధాని అప్రమత్తం
- పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి హెచ్చరించిన అగంతకుడు
- నగరంలో వరుస పేలుళ్లకు పాల్పడుతున్నట్టు హెచ్చరిక
- ముమ్మరంగా తనిఖీలు చేసిన పోలీసులు
- అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు
వెంటనే అప్రమత్తమైన పోలీసులు నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.