Mahesh Babu: 'గుంటూరు కారం' నుంచి నాటు సాంగ్ .. మరింత పెరిగిన ఘాటు!

  • త్రివిక్రమ్ నుంచి 'గుంటూరు కారం'
  • మహేశ్ జోడీకట్టిన శ్రీలీల
  • సంగీతాన్ని అందించిన తమన్ 
  • మాస్ పాటలో మరింత ఘాటు 
  • సంక్రాంతికి సినిమా రిలీజ్

Gunturu Karam Movie Song Promo Release

మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో 'గుంటూరు కారం' సినిమా రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. అందులో భాగంగానే కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్ కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

'ఆ కుర్చీని మడతబెట్టి' అంటూ ఈ పాట మొదలవుతోంది. తమన్ స్వరకల్పనలో మహేశ్ బాబు - శ్రీలీల బృందం పై చిత్రీకరించిన పాట ఇది. ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ పాటను చిత్రీకరించారనే విషయం తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసుకున్న పాట అనే సంగతి అర్థమవుతోంది. పూర్తి పాట ఈ సాయంత్రం 4:05 నిమిషాలకు వదలనున్నారు.

More Telugu News