New Rules 2024: బ్యాంకింగ్, ఆధార్, ఐటీ... విషయాలలో వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవి!

  • ఉచితంగా ఆధార్ వివరాలు మార్చుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 31 
  • జనవరి 1 నుంచి కొత్త సిమ్ కొనుగోలుకు డిజిటల్ కేవైసీ తప్పనిసరి
  • డీమాట్ అకౌంట్ నామినేషన్, బ్యాంక్ లాకర్ల రివైజ్డ్ అగ్రిమెంట్‌కు డిసెంబర్ 31 తుది గడువు
Rules changing from January 1 in 2024 Everything you need to know about them in detail

మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగిడబోతున్నాం. దీంతో పాటూ బ్యాంకింగ్, ఇతర విషయాల్లో పలు కీలక మార్పులు రానున్నాయి. అవేంటంటే..

  • డీమాట్ అకౌంట్ హోల్డర్లు జనవరి 1 లోపు తమ నామినేషన్ వివరాలు సమర్పించాలి. ఈ రూల్ పాటించని వాళ్లు స్టాక్స్‌తో ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేరు. 
  • ఆధార్‌ కార్డు వివరాల్లో ఉచితంగా మార్పులు చేసుకునేందుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఆ తరువాత చేసుకునే మార్పులకు రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 
  • సిమ్ కార్డుల కేవైసీ ధ్రువీకరణ మొత్తం ఇకపై డిజిటల్ రూపంలోనే జరుగుతుంది. ఎటువంటి దరఖాస్తులు నింపాల్సిన అవసరం ఉండదు. కొత్త సిమ్ కొనుగోలు సమయంలో టెలికాం కంపెనీలు కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తాయి. మోసాలకు కళ్లెం వేసేందుకు ఈ నిబంధన ప్రవేశపెట్టారు. 
  • బ్యాంక్ లాకర్లు ఉన్న వారందరూ డిసెంబర్ 31లోపు తమ బ్యాంకులతో రివైజ్డ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలి. లేకపోతే, లాకర్‌ను ఫ్రీజ్ చేస్తారు. 
  • కొత్త టెలీకమ్యూనికేషన్ బిల్లు ప్రకారం, ఫేక్ సిమ్‌లు కొనుగోలు చేసేవారికి మూడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. 
  • 2022-23 ఆర్ధిక సంవత్సరానికి చెందిన ఐటీ రిటర్నుల దాఖలుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఈలోపు పెనాల్టీ సహా రిటర్నులు దాఖలు చేయాలి. 

More Telugu News