CUET-2024: జాతీయ స్థాయిలో పీజీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల

  • విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
  • డిసెంబరు 26 నుంచి జనవరి 24 వరకు దరఖాస్తులు
  • మార్చి 11 నుంచి 28 వరకు పరీక్షలు
NTA releases CUET 2024 notification

జాతీయస్థాయిలో విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024కు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబరు 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 2024 జనవరి 24 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 

పీజీ ఎంట్రన్స్ మార్చి 11 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఓ ప్రకటనలో వెల్లడించింది. 


వివరాలు ఇవిగో...

  • డిసెంబరు 26 నుంచి జనవరి 24 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • జనవరి 27 నుంచి 29 వరకు దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు అవకాశం
  • మార్చి 7 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్
  • మార్చి 11 నుంచి 28 వరకు పరీక్షలు
  • గతేడాదితో పోల్చితే ఈసారి సీయూఈటీలో మార్పులు
  • మూడు షిఫ్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • గతేడాది ఎంట్రన్స్ టెస్టుకు రెండు గంటల సమయం... ఈసారి ఆ సమయం 1.45 గంటలకు కుదింపు
  • అదే సమయంలో... ప్రశ్నల సంఖ్యను కూడా తగ్గించిన ఎన్టీయే. గతేడాది 100 ప్రశ్నలతో పరీక్ష... ఈసారి 75 ప్రశ్నలతో పరీక్ష
  • ఈసారి పరీక్ష ఫీజు పెంపు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు రూ.1200, ఓబీసీ/ఎన్ సీఎల్/జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు రూ.1000, దివ్యాంగులకు రూ.800, ఎస్సీ/ఎస్టీ/హిజ్రాలకు రూ.900 పరీక్ష ఫీజుగా నిర్దేశించారు.

More Telugu News