EC: ఏపీలో ఓటర్ల జాబితా విడుదల తేదీని పొడిగించిన కేంద్ర ఎన్నికల సంఘం

  • తొలుత జనవరి 5న ఓటర్ల తుది జాబితా విడుదల చేయాలనుకున్న ఈసీ
  • తాజాగా జనవరి 22న విడుదల చేయనున్నట్టు ప్రకటన
  • ఏపీ సహా 12 రాష్ట్రాల్లో జాబితా విడుదలకు సన్నాహాలు
EC extends voters list release date

ఏపీలో ఓటర్ల ప్రత్యేక తుది జాబితాను జనవరి 5న విడుదల చేయాలని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. జనవరి 22న ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల చేయనున్నట్టు తాజా ప్రకటనలో పేర్కొంది. ఏపీ సహా 12 రాష్ట్రాల్లో ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదలకు సన్నాహాలు చేయాలని ఆయా రాష్ట్రాల సీఈవోలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో, అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12 వరకు పొడిగించింది. ఈసీ తాజా నిర్ణయం నేపథ్యంలో, ఓటర్ల జాబితాల్లో సవరణలకు జనవరి 17 వరకు అవకాశం ఉంటుంది.

More Telugu News