KCR: నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదాలపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

  • పలువురు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేసిన కేసీఆర్
  • మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపిన మాజీ సీఎం
  • బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి  
KCR on Nalgoda district accidents

నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.

More Telugu News