ట్రాఫిక్ చలానాలపై మరోసారి భారీ రాయితీ.. సన్నద్ధమవుతున్న తెలంగాణ పోలీసు శాఖ
- పెండింగ్ చలానాలను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్న పోలీసు శాఖ
- గతేడాది మాదిరిగానే భారీగా రాయితీలు ఇవ్వాలని నిర్ణయం
- త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం
నవంబర్ 2023 చివరి నాటికి రాష్ట్రంలో పెండింగ్ చలానాల సంఖ్య రెండు కోట్లకు చేరుకుందని అంచనాగా ఉంది. ఈ సంఖ్యను వీలైనంతగా తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీసు శాఖ అడుగులు వేస్తోంది. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించేవారికి మరోమారు రాయితీ కల్పించాలని నిర్ణయించింది. కాగా 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్లో ఉండగా ప్రత్యేక రాయితీ ప్రకటించడంతో చాలామంది వాహనదారులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న విషయం తెలిసిందే.