Pawan Kalyan: యువగళం సభ కోసం విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్

  • డిసెంబరు 18న ముగిసిన లోకేశ్ యువగళం పాదయాత్ర 
  • నేడు విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద విజయోత్సవ సభ
  • హాజరవుతున్న చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్
Pawan Kalyan arrives Vizag for Yuvagala meeting

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 18న ముగిసింది. ఈ నేపథ్యంలో, నేడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. 

ఈ సభ కోసం ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ విచ్చేశారు. తాజాగా, యువగళం సభలో పాల్గొనేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు కదిలారు. కాసేపట్లో యువగళం-నవశకం సభ ప్రారంభం కానుంది.

More Telugu News