Road Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం... తెలంగాణ అయ్యప్ప భక్తుల మృతి

  • చెన్నై బైపాస్ రోడ్డు వద్ద  ఘటన
  • శబరిమల నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం
  • కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న వైనం
  • అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ముగ్గురు భక్తులు
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Road accident in Tamilnadu as three killed

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. శబరిమల వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. చెన్నై బైపాస్ కు సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులు ములుగు జిల్లా మంగపేట కమలాపురం గ్రామానికి చెందిన సుబ్బయ్యనాయుడు, రాజు, నరసాంబయ్యగా గుర్తించారు. వీరంతా ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News