మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్ తొలి రోజే సంచలన నిర్ణయం
- బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయాలపై నిషేధం విధించిన నూతన ప్రభుత్వం
- జనాల్లో అవగాహన కల్పించాక చర్యలు ఉంటాయని హెచ్చరిక
- తొలి కేబినెట్ నిర్ణయాలను ప్రకటించిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. అయోధ్య రాముడి గుడికి వెళ్లేవారికి మార్గమధ్యంలో మధ్యప్రదేశ్ స్వాగతం పలుకుతుందని చెప్పారు. తునికాకు సేకరించేవారికి బస్తాకు రూ.4,000 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాగా మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.