ఈరోజు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరుకు వెళ్తున్న చంద్రబాబు
- ఆలయాలను దర్శించుకుంటున్న చంద్రబాబు
- శ్రీపెరుంబుదూరులోని శ్రీరామానుజర్ ఆలయంలో పూజలు నిర్వహించనున్న బాబు
- రాత్రికి విజయవాడకు చేరుకోనున్న టీడీపీ అధినేత
ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయల్దేరి చెన్నైకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరుంబుదూరుకు వెళ్తారు. దర్శనం అనంతరం చెన్నై చేరుకుంటారు. అనంతరం 8.50 గంటలకు విజయవాడకు విమానంలో బయల్దేరుతారని చంద్రశేఖర్ వెల్లడించారు.