Bahawalpur Zoo: జూలోని పులి నోట్లో షూ.. పక్కనే సగం తినేసిన మనిషి మృతదేహం!

  • పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్ జూలో ఘటన
  • ఆలస్యంగా వెలుగులోకి
  • జూను మూసేసి దర్యాప్తు ప్రారంభించిన అధికారులు
Man Found Half Eaten By Zoo Tigers In Pakistan

పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌ లోని ఓ జంతు ప్రదర్శనశాలలో దారుణం జరిగింది. ఓ పులి బోనులో సగం తిన్న మనిషి శరీరాన్ని గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు జూను మూసివేశారు. గత బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజువారీ చెకింగ్‌లో భాగంగా జూ సిబ్బంది బుధవారం ఉదయం అన్ని ఎన్‌క్లోజర్లను చెక్ చేస్తుండగా ఓ పులి నోట్లో షూ కనిపించింది. దానిపక్కనే సగం తిన్న మనిషి శరీరాన్ని గుర్తించారు. 

అతడు ఎన్‌క్లోజర్‌లోకి దూకి పులికి ఆహారమై ఉంటాడని, మంగళవారం రాత్రే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పులి దాడిచేసినప్పుడు అతడు బతికే ఉండొచ్చని చెబుతున్నారు. బాధితుడిని గుర్తించాల్సి ఉంది. అతడు పులి నోటికి ఎలా చిక్కాడన్న దానిపై దర్యాప్తు జరుగుతోందని, ప్రస్తుతం జూను మూసివేశామని అధికారులు తెలిపారు.

More Telugu News