నాదెండ్ల మనోహర్ అరెస్ట్ పై నాగబాబు ఆగ్రహం
- ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలపడం తప్పా? అని ప్రశ్నించిన నాగబాబు
- టైకూన్ జంక్షన్ ను తెరవాలని కోరినందుకు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని విమర్శ
- పోలీసుల తీరును ఖండిస్తున్నామని వ్యాఖ్య
విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు తమ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమయ్యారని... అయితే, వారిపట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని చెప్పారు.