Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ కెప్టెన్ పై జైషా ఆసక్తికర వ్యాఖ్యలు

  • వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్
  • రోహిత్ శర్మే కెప్టెన్ అంటూ ప్రచారం
  • కెప్టెన్ ను ఇంకా ప్రకటించలేదన్న జై షా
Jai Shah comments on T20 world cup captain

వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీకి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడనే ప్రచారం జరిగినప్పటికీ... తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన కామెంట్లు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ కు కెప్టెన్ ను ప్రకటించలేదని చెప్పారు. కెప్టెన్ ఎవరో చెప్పడానికి ఇంకా సమయం ఉందని జైషా తెలిపారు. టీ20 వరల్డ్ కప్ కెప్టెన్ ఎవరనే విషయం గురించి ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు ఐపీఎల్, ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ ఉన్నాయని తెలిపారు. టీ20 ప్రపంచకప్ కెప్టెన్ ఇప్పటికిప్పుడు ప్రకటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 

More Telugu News