కేసీఆర్ కోలుకుంటున్నారు.. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరాను: రేవంత్ రెడ్డి
- యశోదా ఆసుపత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి
- మంచి పాలన కోసం కేసీఆర్ సూచనలు అవసరమన్న రేవంత్
- ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉందన్న సీఎం
కేసీఆర్ ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించానని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో మంచి పాలన అందించడానికి... ఆయన సూచనలు కూడా అవసరం అని అన్నారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్ ను కోరానని తెలిపారు.