Stock Market: నిన్నటి నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు

  • కొనుగోళ్లకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 304 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 68 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

నిన్న నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తేరుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్లు లాభపడి 69,826కి చేరుకుంది. నిఫ్టీ 68 పాయింట్లు పుంజుకుని 20,969 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.92%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.47%), ఇన్ఫోసిస్ (1.67%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.38%), యాక్సిస్ బ్యాంక్ (1.19%). 

టాప్ లూజర్స్:
ఐటీసీ (-1.95%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.35%), బజాజ్ ఫైనాన్స్ (-1.15%), టాటా మోటార్స్ (-1.00%), నెస్లే ఇండియా (-0.73%).     

More Telugu News