Chandrababu: చంద్రబాబుకు భారీ ఊరట.. సీఐడీ పీటీ వారెంట్లను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు

  • ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ పీటీ వారెంట్లు
  • చంద్రబాబు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారన్న ఏసీబీ కోర్టు
  • పీటీ వారెంట్లకు విచారణ అర్హత లేదని స్పష్టీకరణ
ACB court rejects CID PT warrants on Chandrababu in IRR and Fiber Net cases

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు భారీ ఊరటనిచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబును విచారించేందుకు సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సమయంలోనే సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసింది. ఈరోజు ఈ పిటిషన్లను విచారించిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారని... అందువల్ల పీటీ వారెంట్లకు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News