ఏపీ రాజధాని అమరావతే: రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం

  • రాజ్యసభలో లిఖితపూర్వక ప్రకటన చేసిన కేంద్ర సహాయమంత్రి కౌశల్ కుమార్
  • 28 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని వెల్లడి
  • కేంద్రం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ జాబితాలో అమరావతి కూడా ఉందని స్పష్టీకరణ
ఏపీ రాజధాని అమరావతి అంటూ కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కుమార్ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక ప్రకటన చేశారు. 28 రాష్ట్రాల రాజధానుల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఉందని, ఆ ప్లాన్ కు కేంద్రం ఆమోదం తెలిపిందని కౌశల్ కుమార్ తెలిపారు. ఈ జాబితాలో అమరావతి కూడా ఉందని స్పష్టం చేశారు. అమరావతికి కూడా మాస్టర్ ప్లాన్ ఉందని మంత్రి వెల్లడించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ కు కూడా కేంద్రం ఆమోదం ఉందని వివరించారు.

Amaravati
AP Capital
Rajya Sabha
Kaushal Kumar
Union Govt
Master Plan

More Telugu News