మిచౌంగ్ తుపాను.. ఏపీలో వర్షాలు!
- మిచౌంగ్ తుపానుతో ఏపీలో మారిన వాతావరణ పరిస్థితులు
- కాకినాడలో పలు ప్రాంతాల్లో వర్షాలు
- కంట్రోల్ రూంలో, పునరావాస కేంద్రాల ఏర్పాటు
కాగా, జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాకినాడ, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూంలను కూడా ఏర్పాటు చేశారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు.. కలెక్టరేట్: 18004253077, కాకినాడ ఆర్డీవో కార్యాలయం: 9701579666, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం: 9949393805.
ఇదిలావుంచితే, నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షనూ వాయిదా వేసింది. ఎన్టీఆర్ జిల్లాలో నేడు, రేపు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.