పోలింగ్ కేంద్రంలేక ఓటుకు దూరం.. మరో అవకాశం కోసం గ్రామస్తుల విజ్ఞప్తి
పోలింగ్ కేంద్రం లేక ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన తమకు మరో అవకాశం కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండి గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. రవాణా సదుపాయం కూడా లేకపోవడంతో మరో కేంద్రానికి కూడా వెళ్లలేకపోయామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గ్రామస్థులు కలక్టరెట్కు వచ్చి వినతిపత్రం సమర్పించారు. పాలనాధికారి అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలోని ఇన్వర్డ్ విభాగంలో వినతి పత్రాన్ని అందజేశారు.