Road Accident: పోలీసు ఆఫీసర్ తనయుడి ర్యాష్ డ్రైవింగ్.. మహిళ దుర్మరణం

  • హన్మకొండలోని కాజీపేట కేంద్రంలో ఘటన 
  • బైక్ ఎక్కుతున్న మహిళను వెనక నుంచి ఢీకొట్టిన కారు
  • ఘటనా స్థలంలోనే మహిళ మృతి
woman dies after car hits her in Hanmakonda driver said to be police officers son

ర్యాష్ డ్రైవింగ్ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ పోలీసు అధికారి తనయుడు కారుతో ఓ మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. హన్మకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో ఈ ప్రమాద ఘటన జరిగింది. సెయింట్ గాబ్రియెల్ స్కూలు వద్ద కవిత అనే మహిళ బైక్ ఎక్కబోతుండగా స్విఫ్ట్ కారు వెనక నుంచి వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. 

ఓటు వేయడానికి భర్తతో వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారు రాంగ్ రూట్‌లో మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరిగింది. కారు నడిపిన యువకుడు ఎక్సైజ్ శాఖ సీఐ కుమారుడని సమాచారం.

More Telugu News