Chandrababu: గన్నవరం నుంచి విజయవాడ వచ్చేందుకు చంద్రబాబుకు 5 గంటల సమయం... టీడీపీ అధినేతపై పూల వర్షం

  • తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు
  • ప్రత్యేక విమానంలో గన్నవరం చేరిక
  • విజయవాడ వచ్చే క్రమంలో అడుగడుగునా బ్రహ్మరథం
  • రోడ్డుపైకి వచ్చి సంఘీభావం తెలిపిన మహిళలు
  • వాహనాలు నియంత్రించలేక ఇబ్బంది పడిన పోలీసులు
Huge welcome for Chandrababu in Gannavaram constituency

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని విజయవాడ చేరుకున్నారు. అయితే, గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన విజయవాడ చేరుకునేందుకు 5 గంటల సమయం పట్టింది. అడుగడుగునా పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. 

చంద్రబాబుకు గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు రోడ్డుపైకి వచ్చి టీడీపీ అధినేతకు సంఘీభావం ప్రకటించారు. ప్రసాదంపాడు గ్రామస్తులు చంద్రబాబుపై పూలవర్షం కురిపించారు. 

ఈ నేపథ్యంలో, వాహనాలు నియంత్రించలేక ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందిపడ్డారు. దాంతో, కాన్వాయ్ త్వరగా వెళ్లిపోవాలని పోలీసులు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కారు డోర్ వద్ద నిలబడి అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకెళ్లారు.

More Telugu News