Dharmana Prasada Rao: సీఎం జగన్ కు మంత్రి ధర్మాన లేఖ

  • విశాఖలో ఫైనాన్షియల్ హబ్ ఏర్పాటు చేయాలని ధర్మాన లేఖ
  • అందుకోసం 100 ఎకరాలు కేటాయించాలని విజ్ఞప్తి
  • ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడేలా హబ్ ఉండాలని వినతి
Minister Dharmana wrote CM Jagan seeking financial in Visakha

విశాఖపట్నంలో ఫైనాన్షియల్ హబ్ ఏర్పాటు చేయాలంటూ ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్ కు లేఖ రాశారు. ఈ ఫైనాన్షియల్ హబ్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలని ధర్మాన కోరారు. ఈ ఫైనాన్షియల్ హబ్ ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థికశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఆర్బీఐ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, వివిధ బ్యాంకులు ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు, పలు ఆర్థిక సంస్థలు ఈ హబ్ లో ఉండేలా కృషి చేయాలని ధర్మాన సీఎం జగన్ ను కోరారు. ఈ హబ్ కోసం 100 ఎకరాల భూమి కేటాయించాలని తన లేఖలో తెలిపారు.

More Telugu News