ఆ సర్వేతో తనకు ఏ సంబంధం లేదని లగడపాటి చెప్పారు: బండ్ల గణేశ్

ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి లగడపాటి సర్వే చేయించారని... బీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలవబోతోందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారని సర్వేలో తేలిందనే వార్త వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ కు 67 నుంచి 72 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 39 నుంచి 44 వరకు వస్తాయని, బీజేపీకి 4 నుంచి 6 వరకు, ఎంఐఎంకు 7 స్థానాలు, ఇతరులు రెండు చోట్ల గెలుస్తారని సర్వేలో తేలిందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై సినీ నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. తాను లగడపాటి రాజగోపాల్ తో మాట్లాడానని... ఆ సర్వేలకు, తనకు సంబంధం లేదని ఆయన చెప్పారని వెల్లడించారు. ఈ వార్తలన్నీ బూటకమని చెప్పారు.


More Telugu News