వీసా లేకుండానే భారతీయ పర్యాటకులకు మలేసియా ఎంట్రీ
- డిసెంబర్ 3 నుంచి మొదలుకానున్న ఆఫర్
- 30 రోజులపాటు అక్కడ గడిపేందుకు ఛాన్స్
- భారత్తోపాటు చైనా పౌరులకు కూడా ఆఫర్
- విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే మలేసియా లక్ష్యం
విదేశీ పర్యాటకులు, ఇన్వెస్టర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీసాతో ముడిపడిన ప్రక్రియను సులభతరం చేయాలని యోచిస్తున్నట్టు గత నెలలోనే ప్రధాని అన్వర్ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్, చైనా దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యాలను కల్పించనున్నట్టు చెప్పారు. దేశంలోకి పర్యాటకుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇస్తుందని మలేసియా ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి.