Road Accident: నల్గొండ జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

  • చింతపల్లి శివారులో వోల్వో బస్సు ప్రమాదం
  • హైదరాబాద్ నుంచి మాచర్ల వెళ్తుండగా ఘటన
  • 10 మందికి గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు
Private travel bus overturned in Nalgonda district

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మాచర్ల వెళ్తున్న వోల్వో బస్సు చింతపల్లి శివారులో బోల్తా పడింది. చింతపల్లి వద్ద నాగార్జునసాగర్‌ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. పది మంది ప్యాసింజర్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలావుండగా రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు రక్తమోడుతున్నాయి. అతివేగంతోపాటు ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

More Telugu News