Ukku Satyagraham: వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే నటించిన చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం'... గద్దర్ కుమార్తె చేతుల మీదుగా ట్రైలర్ విడుదల

సత్యారెడ్డి దర్శకనిర్మాతగా ఉక్కు సత్యాగ్రహం
కథానాయకుడు కూడా సత్యారెడ్డే!
విశాఖ ఉక్కు పరిశ్రమ ఇతివృత్తంతో చిత్రం
ఈ సినిమాలో నటించిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే ధర్మశ్రీ
Gaddar daughter launches Ukku Satyagraham movie trailer and songs

విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఉక్కు సత్యాగ్రహం. ఈ చిత్రంలో సత్యారెడ్డి కథానాయకుడు. దర్శకత్వం, నిర్మాణం కూడా ఆయనే. పల్సర్ బైక్ సాంగ్ ఫేమ్ ఝాన్సీ (గాజువాక డిపో కండక్టర్) కథానాయికగా నటిస్తోంది. 

కాగా, ఈ చిత్రంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ), వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ (చోడవరం) తదితరులు నటించారు. ప్రజాగాయకుడు గద్దర్ ఓ కీలక పాత్ర పోషించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన ఉద్యమం, పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను, పాటలను గద్దర్ కుమార్తె వెన్నెల విడుదల చేశారు. 

ఈ సందర్భంగా గద్దర్ కుమార్తె మాట్లాడుతూ, తన తండ్రి ప్రజల కోసం ఎంతో పాటు పడ్డారని, ఆయన పాటలన్నీ ప్రజా సమస్యలపైనే ఉండేవని తెలిపారు. గద్దర్ ప్రజాసమస్యలపై వచ్చిన చిత్రాల్లో నటించారని, ఈ ఉక్కు సత్యాగ్రహం చిత్రంలోనూ నటించారని, పాటలు కూడా రాశారని వెన్నెల వివరించారు. 

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పందిస్తూ, ఈ సినిమాలో తనను కూడా భాగం చేయడం ఆనందం కలిగిస్తోందని తెలిపారు. 

More Telugu News