కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చాక రియాల్టీ రంగం 28 శాతం పడిపోయింది.. తెలంగాణలో గెలిస్తే ఢమాల్: కేటీఆర్
- టీవీ9 నిర్వహించిన మెగా కాన్క్లేవ్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో రియాల్టీ రంగం పడిపోతుందని వ్యాఖ్య
- తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని తేల్చి చెప్పిన కేటీఆర్
- బీఆర్ఎస్కు 70 నుంచి 82 సీట్లు వస్తాయని జోస్యం
పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రియాల్టీ రంగం ఢమాల్ అవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ వాళ్లు ప్రతి ఆరునెలలకో ముఖ్యమంత్రిని మారుస్తుంటారని, అలాంటి పరిస్థితుల్లో స్థిరమైన పాలన ఎలా ఇవ్వగలరు? అందుకే రియల్ ఎస్టేట్ పడిపోతుందన్నారు. అదే సమయంలో పాలనాపరమైన నిర్ణయాలను కూడా త్వరితగతిన తీసుకోలేరని చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బెంగళూరులో రియాల్టీ రంగం 28 శాతం మేర పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. అదే సమయంలో హైదరాబాద్లో శరవేగంగా పెరుగుతోందన్నారు.