కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అవకాశమివ్వరు: బీజేపీ కిషన్ రెడ్డి
- బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రకటించగలవా? అని ప్రశ్న
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారుతారని ఎద్దేవా
- కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కేసీఆర్ కలలు కంటున్నారని సెటైర్లు
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. ప్రజలు బీజేపీకే అవకాశమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మెడికల్ కాలేజీ కోసం వందలాది ఉత్తరాలు రాశానని కేసీఆర్ చెబుతున్నారని, వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు ఎందుకు ఆలస్యం అవుతోంది? అని ప్రశ్నించారు.