Vaishnav Tej: ఈ వారం థియేటర్లకు వస్తున్న సినిమాలివే!

  • ఈ నెల 24న వస్తున్న 'ఆదికేశవ'
  • అదే రోజున విడుదలవుతున్న 'ధృవ నక్షత్రం'
  • 'నాయట్టు' రీమేక్ గా పలకరించనున్న 'కోట బొమ్మాళి పీఎస్'
  • హ్రితిక శ్రీనివాస్ రెండో సినిమాగా వస్తున్న 'సౌండ్ పార్టీ'   

New Movies Update

ఈ శుక్రవారం థియేటర్లకు నాలుగు సినిమాలు వస్తున్నాయి. ఆ జాబితాలో 'ఆదికేశవ' .. 'కోట బొమ్మాళీ పీఎస్' .. 'సౌండ్ పార్టీ' .. 'ధ్రువ నక్షత్రం' సినిమాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలన్నింటిలో 'ఆదికేశవ'కి ఎక్కువ బజ్ కనిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ - శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించాడు. యాక్షన్ తో పాటు రొమాంటిక్ లవ్ ను టచ్ చేస్తూ ఈ కథ నడవనుంది. ఇక శ్రీకాంత్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాహుల్ విజయ్ .. శివాని రాజశేఖర్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'కోట బొమ్మాళీ పీఎస్' కూడా 24వ తేదీనే విడుదల కానుంది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో వచ్చిన 'నాయట్టు' సినిమాకి రీమేక్. గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందనేది చూడాలి. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ రూపొందించిన 'ధ్రువ నక్షత్రం' కూడా ఈ శుక్రవారమే థియేటర్లకు రానుంది. భారీతనం ప్రధానమైన ఆకర్షణగా కనిపిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  ఇక అదే రోజున 'సౌండ్ పార్టీ' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో 'బిగ్ బాస్' విజేతగా నిలిచిన వీజే సన్నీ హీరోగా చేసిన ఈ సినిమాలో, కథానాయికగా ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ నటించింది. ఏ సినిమాకి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందనేది చూడాలి మరి.

More Telugu News