KTR: నేను రష్మిక మందన్నా అంత ఫేమస్ కాదు: మంత్రి కేటీఆర్

  • డీప్ ఫేక్ మహిళలకే కాదు.. నాయకులకూ ప్రమాదకరమేనన్న కేటీఆర్
  • తన చెల్లి కవిత చాలా డైనమిక్... కుటుంబంలో అత్యంత ధైర్యవంతురాలన్న కేటీఆర్
  • బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చాక మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు
Minister KTR on deep fake

డీప్ ఫేక్ మహిళలకు మాత్రమే కాదని, రాజకీయ నాయకులకు కూడా ప్రమాదకరమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రత్యర్థులు డీప్ ఫేక్ వాడి తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను రష్మిక మందన్న అంత ఫేమస్ కాదని సరదాగా వ్యాఖ్యానించారు. 

ఈ ఎన్నికల్లో తామే గెలుస్తామని, ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసునని, కానీ వారు నటిస్తున్నారన్నారు. తన చెల్లి కవిత చాలా డైనమిక్ అని, కుటుంబంలో అత్యంత ధైర్యవంతురాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయలో 'వుమెన్ ఆస్క్ కేటీఆర్' పేరుతో మహిళలతో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన చిన్నప్పటి నుంచి కేసీఆర్ ప్రజాజీవితంలో ఉన్నారని, అందుకే తనపై ఆయన ప్రభావం తక్కువగా ఉండేదని, తన తల్లిని చూసి చాలా నేర్చుకున్నానన్నారు. తన సతీమణి చాలా ఓపికగా ఉంటారన్నారు. తన కూతురు చిన్న వయస్సులోనే బాగా ఆలోచన చేస్తోందన్నారు. కూతురు పుట్టాక తన జీవితం చాలా మారిందన్నారు. ఇద్దరు పిల్లల్నీ సమానంగా చూస్తానన్నారు.

బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తే మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలకు సరైన సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వలేదని, ఈ విషయంలో బాధగా ఉందన్నారు. మహిళల సంఖ్య పెంచేలా చూస్తామని చెప్పారు. మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారని, వారిని చూసి నేర్చుకోవాలన్నారు. ఉప్పల్ వైపు కూడా ఐటీ కంపెనీలు వచ్చేలా చూద్దామన్నారు. ఏపీ, తెలంగాణ మహిళలు స్త్రీ నిధి రుణాలు తీసుకొని 99 శాతం చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఆ రుణాలతో వారు వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారన్నారు.



More Telugu News