World Cup 2023: ప్రపంచకప్ ట్రోఫీతో భారత్, ఆస్ట్రేలియా స్కిప్పర్ల ఫొటోషూట్ వైరల్.. ఫొటోలు ఇవిగో!

  • మరికాసేపట్లో భారత్-ఆసీస్ మధ్య ప్రపంచకప్ ఫైనల్ సమరం
  • ప్రపంచకప్ ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్ల ఫొటో సెషన్
  • అటలాజ్ స్టెప‌వెల్‌లో ఫొటోషూట్
Team India and Australia Skippers Pre Shoot With World Cup Trophy Goes Viral

మరికాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా, ఆసీస్ సారథులు రోహిత్‌శర్మ, పాట్ కమిన్స్ ప్రపంచకప్ ట్రోఫీతో ప్రీమ్యాచ్ ఫొటోసెషన్‌లో పాల్గొన్నారు. గుజరాత్‌ గాంధీనగర్‌లోని చిన్న పట్టణమైన అడలాజ్  స్టెప్‌వెల్‌లో ఈ ఫొటో  సెషన్ నిర్వహించారు. స్కిప్పర్లు ఇద్దరూ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోసెషన్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోలను ఐసీసీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. 

  అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఈ ఫైనల్ కోసం సర్వం సిద్ధమైంది. ఆటగాళ్లే కాదు.. యావత్ దేశం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వరుస విజయాలతో ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి ముచ్చటగా మూడోసారి దేశానికి ప్రపంచకప్ అందించాలని పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియా ఆరో కప్‌పై కన్నేసింది.  
   

More Telugu News