Ganta Srinivasa Rao: జగనన్న దెబ్బకు అమరావతికి మొహం చాటేసిన సంస్థల జాబితా చూస్తుంటే తెలుగు పౌరులుగా మనం సిగ్గు పడాలి: గంటా శ్రీనివాసరావు

  • జగన్ రివర్స్ పాలనతో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందన్న గంటా
  • ప్రతిష్ఠాత్మక సంస్థలు హైదరాబాద్ నుంచే పని చేస్తున్నాాయని వ్యాఖ్య
  • అమరావతి రాజధానిగా ఉండి ఉంటే ఆ సంస్థలన్నీ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించి ఉండేవన్న గంటా
Ganta Srinivasa Rao fires on Jagan

జగనన్న దెబ్బకు అమరావతికి మొహం చాటేసిన సంస్థల జాబితా చూస్తుంటే సాటి తెలుగు పౌరులుగా మనం సిగ్గు పడాలని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగలడంతో కేంద్ర కార్యాలయాలు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ సంస్థలు అసలు ఏపీ జోలికి రావడం మానేశాయని చెప్పారు. పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు కూడా అమరావతిలో కేంద్రీయ కార్యాలయం లేక హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న వైనం చూస్తుంటే రాష్ట్రానికే అవమానమని అన్నారు. రాష్ట్రంలో ఈ గందరగోళాలు, నిర్వాకాలు, నిర్లక్ష్యాలు జరగకుండా అమరావతి రాజధానిగా ఉండి ఉంటే... అమరావతిలో ఈ సంస్థలన్నీ ఈ పాటికి తమ కార్యకలాపాలు ప్రారంభించి కూడా ఉండేవని చెప్పారు. ఆయా సంస్థల జాబితాను ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.  

  • ◆నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఎస్ఐడీ) 
  • ◆నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్) 
  • ◆డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ 
  • ◆ఇండియన్ నేవీ 
  • ◆బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) 
  • ◆కేంద్రీయ విద్యాలయ-1 
  • ◆కేంద్రీయ విద్యాలయ-2 
  • ◆నేషనల్ బయోడైవర్సిటీ మ్యూజియం 
  • ◆సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ) 
  • ◆రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 
  • ◆కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) 
  • ◆సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐ) 
  • ◆సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 
  • ◆ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) 
  • ◆భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) 
  • ◆విదేశ్ భవన్ (కేంద్ర విదేశాంగశాఖ ఆధ్వర్యంలో) 
  • ◆నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) 
  • ◆ఇండియన్ ఆర్మీ 
  • ◆రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 
  • ◆ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) 
  • ◆జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడిఎస్ఐ) 
  • ◆భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 
  • ◆ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్) 
  • ◆కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ) 
  • ◆స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 
  • ◆నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) 
  • ◆ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) 
  • ◆భారత జీవిత బీమా సంస్థ (ఎలస్ఐసీ) 
  • ◆బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) 
  • ◆ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) 
  • ◆న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఏసీఎల్) 
  • ◆సిండికేట్ బ్యాంక్ (ఆఫీస్ స్పేస్) 
  • ◆హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్' (హెచ్పీసీఎల్) 
  • ◆రెయిల్ ఇండియా టెక్నికల్ ఎకనమిక్ సర్వీసెస్ (రైట్స్) 
  • ◆యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) 
  • ◆భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 
  • ◆ఇండియన్ బ్యాంక్ హడ్కో రీజినల్ ఆఫీస్ 
  • ◆విజయా బ్యాంక్ 
  • ◆కెనరా బ్యాంక్ 
  • ◆గెయిల్ ఇండియా లిమిటెడ్

ఇలా ఎన్నో సంస్థలు అమరావతికి మోహం చాటేశాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి రివర్స్ పాలన వలన రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని విమర్శించారు. చరిత్ర పుటల్లో ఆంద్రప్రదేశ్ ను అట్టడుగుకు నెట్టడంలో మనం భాగస్వాములం కాకుండా ఓటు అనే ఆయుధంతో 2024లో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమికొట్టి మన రాష్ట్ర భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకుందామని అన్నారు.

More Telugu News