Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 307 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 90 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
  • 3 శాతం వరకు లాభపడ్డ టీసీఎప్ షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన ట్రేడింగ్... కాసేపటికే పుంజుకుంది. ఆ తర్వాత చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 307 పాయింట్లు లాభపడి 65,982కి చేరుకుంది. నిఫ్టీ 90 పరుగులు పుంజుకుని 19,765 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (2.90%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.81%), టెక్ మహీంద్రా (2.77%), ఇన్ఫోసిస్ (2.32%), బజాజ్ ఫైనాన్స్ (1.96%). 

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-1.51%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.45%), ఐటీసీ (-0.78%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.53%), ఎల్ అండ్ టీ (-0.51%).

More Telugu News