ODI World Cup: సెమీ ఫైనల్స్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.. తుది జట్లు ఇవే!

  • ముంబై వాంఖడే స్టేడియంలో ఫస్ట్ సెమీస్
  • న్యూజిలాండ్ తో తలపడుతున్న టీమిండియా
  • ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్న భారత్
Rohit Sharma won the toss and elected to bat first in fist semi finals against New Zealand

వన్డే వరల్డ్ కప్ 2023తో తొలి సెమీఫైనల్స్ టీమిండియా - న్యూజిలాండ్ ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ... ఇది గుడ్ పిచ్ అని చెప్పాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే టాస్ గెలిచాక బ్యాటింగ్ ఎంచుకున్నానని తెలిపాడు. గొప్ప జట్లలో న్యూజిలాండ్ ఒకటని, ఈ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందని తెలిపాడు. ఈరోజు ఎవరు బాగా ఆడితే విజయం వారిదేనని చెప్పాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. 

తుది జట్లు:
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్. 

న్యూజీలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియంసన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్ మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మిచెల్ శాంటర్న్, టిమ్ సౌథీ, ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్.

More Telugu News