ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు
- హయత్నగర్లోని మధుయాష్కీ ఇంట్లో సోదాలు
- పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సంయుక్తంగా దాడి
- బీఆర్ఎస్ ఒత్తిడితోనే చేస్తున్నారన్న మధుయాష్కీ
- ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్న కాంగ్రెస్ నేత
తనిఖీల పేరుతో మధుయాష్కీ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఒత్తిడితో తనిఖీల పేరుతో పోలీసులు తన ఇంట్లోకి చొరబడ్డారని మధుయాష్కీగౌడ్ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ సోదాలపై పోలీసులు స్పందించారు. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వచేసి, డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడం వల్లే తనిఖీలు నిర్వహించినట్టు వివరణ ఇచ్చారు.