Virat Kohli: నెదర్లాండ్స్ ఆటగాడికి కోహ్లీ గిఫ్ట్

  • ఆదివారం నాడు బెంగళూరులో మ్యాచ్
  • నెదర్లాండ్స్ ను 160 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
  • బ్యాటింగ్ లో అర్ధసెంచరీ చేసి, బౌలింగ్ లో ఓ వికెట్ కూడా తీసిన కోహ్లీ
  • మ్యాచ్ ముగిశాక మైదానంలో ఆసక్తికర దృశ్యం
  • వాన్ డెర్ మెర్వ్ కు తాను సంతకం చేసిన జెర్సీని కానుకగా ఇచ్చిన కింగ్
Kohli gifts his signed jersey to Nederlands cricketer Roelof van der Merwe

టీమిండియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య నిన్న వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో టీమిండియా 160 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అర్ధసెంచరీ సాధించడమే కాదు, బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా తీశాడు. 

కాగా, మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. నెదర్లాండ్స్ ఆటగాడు రైలోఫ్ వాన్ డెర్ మెర్వ్ కు కోహ్లీ ఓ కానుక ఇచ్చాడు. తన సంతకంతో కూడిన జెర్సీని వాన్ డెర్ మెర్వ్ కు బహూకరించాడు. కోహ్లీ జెర్సీని గిఫ్ట్ గా అందుకున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మురిసిపోయాడు. కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపాడు. 

వాన్ డెర్ మెర్వ్ గతంలో దక్షిణాఫ్రికా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్నాడు.

More Telugu News