Allu Arjun: 'మంగళవారం' చూస్తుంటే పూనకాలు రావడం ఖాయం: డైరెక్టర్ అజయ్ భూపతి

  • అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా జరిగిన 'మంగళవారం' ఈవెంట్
  • ఆయన రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన డైరెక్టర్ 
  • షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని వెల్లడి 
  • సస్పెన్స్ ను రివీల్ చేయవద్దని కోరిన అజయ్ భూపతి

Mangalavaram Pre Release Event

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మంగళవారం' సినిమా, ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ఘనంగా నిర్వహించారు. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఈ వేడుక కొనసాగింది. ఈ వేదికపై అజయ్ భూపతి మాట్లాడుతూ .. " ఏడాదిన్నర క్రితం ఈ కథను అల్లు అర్జున్ గారు అడిగిమరీ తెలుసుకున్నారు" అని అన్నారు. 

"అల్లు అర్జున్ గారు మా ఫంక్షన్ కి రావడం నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమా తప్పకుండా ఆయనకి నచ్చుతుందని నేను భావిస్తున్నాను. 'మహాసముద్రం' బ్లాక్ బస్టర్ అయినా నేను ఇదే సినిమాను చేసేవాడిని. ఎందుకంటే నేను ఏదైతే అనుకున్నానో అదే చేస్తాను. ఈ సినిమా చూస్తుంటే పూనకాలు రావడం ఖాయం" అని చెప్పారు. 

"అజనీశ్ లోక్ నాథ్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో మీరంతా షాక్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమా చూసినవాళ్లు కొన్ని విషయాలను రివీల్ చేయకూడదని కోరుతున్నాను. మిగతా భాషల్లోను ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము. తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నాను" అని అన్నారు.

More Telugu News