నామినేషన్లతో బాధితుల నిరసన... అత్యధికంగా గజ్వేల్లో 157 నామినేషన్ల దాఖలు
- గజ్వేల్లో 127 మంది 157 వరకు నామినేషన్లు దాఖలు
- 100 మంది వరకు వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్ బాధితులు
- ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలని జగిత్యాల చెరుకు రైతుల పోటీ
- నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున కూడా బరిలోకి పలువురు
గజ్వేల్ తర్వాత మేడ్చల్ నియోజకవర్గం నుంచి 125 నామినేషన్లు, కామారెడ్డి నుంచి 102, మునుగోడు నుంచి 83, సూర్యాపేట నుంచి 81, మిర్యాలగూడ నుంచి 79, సిద్దిపేట నుంచి 76, నల్గొండ నుంచి 71, హుజూరాబాద్ నుంచి 70, కోదాడ నుంచి 66, రాజేంద్రనగర్ నుంచి 64, మల్కాజిగిరి నుంచి 60, ఎల్బీ నగర్ నుంచి 62, శేరిలింగంపల్లి నుంచి 58, సిరిసిల్ల నుంచి 42 నామినేషన్లు దాఖలయ్యాయి.