నా అకౌంటెంట్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- తన కుటుంబ సభ్యులకు చెందిన 30 కంపెనీలపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్న పొంగులేటి
- బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని వ్యాఖ్య
- ఐటీ అధికారులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏమిటని ప్రశ్న
తన అకౌంటెంట్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఒంటికాలుపై నిలబెట్టారని ఐటీ అధికారులపై మండిపడ్డారు. పరిధిని దాటి ఐటీ అధికారులు వ్యవహరించడం దారుణమని అన్నారు. ఐటీ అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని... వారు వారి హద్దుల్లో ఉండాలని చెప్పారు. ఐటీ రూల్స్ తెలియని వారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఐటీ అధికారులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏమైనా ఆధారాలు దొరికితే కేసులు పెట్టాలే కానీ... మనుషులను హింసించడం ఏమిటని మండిపడ్డారు.