Tirumala: ఈ నెల 12న తిరుమలలో బ్రేక్ దర్శనాల రద్దు

  • నవంబరు 12న తిరుమలలో దీపావళి ఆస్థానం
  • కేవలం ప్రోటోకాల్ దర్శనాలకు మాత్రమే అనుమతి
  • నవంబరు 11న ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమన్న టీటీడీ
Break Darshans on November 12 cancelled in Tirumala

తిరుమలలో దీపావళి సందర్భంగా ఈ నెల 12న బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఆ రోజున శ్రీవారి సన్నిధిలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. కేవలం ప్రోటోకాల్ దర్శనాలను మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపింది. నవంబరు 11న ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. దీపావళి సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆస్థాన స్వామికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద సమర్పణతో దీపావళి ఆస్థానం ముగియనుంది.

More Telugu News