ఈ నెల 15 నుంచి విశాఖ ఎయిర్ పోర్టు రాత్రి పూట మూసివేత
- విశాఖలో నేవీ నియంత్రణలో విమానాశ్రయం కార్యకలాపాలు
- రన్ వే పునరుద్ధరణ పనులు చేపడుతున్న అధికారులు
- విశాఖ ఎయిర్ పోర్టులో నిలిచిపోనున్న రాత్రివేళ కార్యకలాపాలు
విమానాశ్రయం రాత్రివేళ మూసివేతపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తూర్పు నౌకాదళ కమాండింగ్ (ఈఎన్ సీ) అధికారులతో చర్చించారు. రన్ వే పునరుద్ధరణ పనుల నిమిత్తం విమానాశ్రయం మూసివేత తప్పనిసరి అని ఈఎన్ సీ చీఫ్ స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే, ఇక్కడి విమానాశ్రయంలో పగటిపూట సర్వీసులు పెంచుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
విశాఖలో తూర్పు నావికాదళ కమాండ్ ఉన్నందున ఇక్కడి ఎయిర్ పోర్టు నేవీ నియంత్రణలో ఉంటుందన్న సంగతి తెలిసిందే.