Andhra Pradesh: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాన్వాయ్‌ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

  • బుధవారం ఉదయం ఒంగోలులో జరిగిన ప్రమాదం
  • బైక్‌పై వెళ్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు
  • ఎంపీ ప్రయాణిస్తున్న వాహనమే ఢీకొట్టిందని చెబుతున్న స్థానికులు
YCP MP Vijayasai Reddys convoy collided with a person and injured

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాన్వాయ్‌లోని ఓ వాహనం బుధవారం ఉదయం బైక్‌ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. కనిగిరిలో నిర్వహించిన వైసీపీ ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’లో పాల్గొనేందుకు ఒంగోలు నుంచి కాన్వాయ్ వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఒంగోలు నగర పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో పునాటి నాగేశ్వరరావు అనే వ్యక్తి తీవ్రమైన గాయాలయ్యాయి. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయాణిస్తున్న కారే బైక్‌ని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. మరో వాహనంలో ఎంపీ వెళ్లిపోయారని అంటున్నారు. 


పేర్నమిట్ట సమీపంలో ఉన్న పొగాకు వేలం కేంద్రం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బాధితుడికి తీవ్రమైన గాయాలవ్వడంతో హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడు నాగేశ్వరరావు బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతలకు చెందినవాడని, పేర్నమిట్టలోని ఓ రైస్‌మిల్లులో పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.

More Telugu News