Chandrababu: ఈ నెల 28 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయం: ఇసుక కేసులో హైకోర్టుకు తెలిపిన సీఐడీ

  • ఇసుక కేసులో ఏ2గా చంద్రబాబు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
  • తదుపరి విచారణను ఈ నెల 22 వరకు వాయిదా వేసిన హైకోర్టు
CID told AP High Court that they will not arrest Chandrababu until 28th

ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును ఈ నెల 28వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సీఐడీ తరపు న్యాయవాదుల స్టేట్మెంట్ ను రికార్డు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆరోగ్య కారణాల వల్ల ఈ నెల 28వ తేదీ వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇసుక కేసులో చంద్రబాబును ఏ2గా సీఐడీ పేర్కొంది.

More Telugu News